గాంధీభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రేవంత్

ABN , First Publish Date - 2021-09-17T16:31:45+05:30 IST

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి గాంధీభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

గాంధీభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రేవంత్

హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గాంధీభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు సెప్టెంబర్ 17అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు మతవిద్వేశాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. సెప్టెంబర్ 17పై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో చర్చ పెట్టాలని, అందుకు కాంగ్రెస్ సహకరిస్తుందన్నారు. 1937 నుంచి 1947 వరకు రజాకార్లు వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాట ఫలితంగానే నిజాం నవాబు తెలంగాణను స్వాతంత్ర్య భారతదేశంలో విలీనం చేశారన్నారని రేవంత్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-09-17T16:31:45+05:30 IST