కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి: రేవంత్రెడ్డి
ABN , First Publish Date - 2021-11-30T19:24:58+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచుతున్నాయని రేవంత్రెడ్డి విమర్శించారు.
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచుతున్నాయని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పంట అమ్ముకోలేక రైతులు ప్రాణాలు వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీతో జరిగిన చీకటి ఒప్పందంలో భాగంగానే రైతు చట్టాల రద్దుపై.. చర్చ జరగకుండా టీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో అడ్డుకున్నారని విమర్శించారు. వరి కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్రం విఫలమైనప్పుడు సీఎం కేసీఆర్ అయినా రైతులను ఆదుకోవాలి కదా? అని అన్నారు. కేసీఆర్కు సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ సర్కార్ కనీసం ప్రత్యామ్నాయ పంటల విధానాన్ని కూడా ప్రకటించలేదన్నారు. కేంద్రం కేసీఆర్ మెడపై కత్తి పెడితే.. ఆస్తులు, పదవులు మోదీకి రాసిస్తారా?... తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని.. కేంద్రం చెప్పినందుకే కేసీఆర్ రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అత్యంత అవినీతిపరుడని రేవంత్రెడ్డి విమర్శించారు.