పోలీస్ అధికారులపై లోక్సభ స్పీకర్కు రేవంత్రెడ్డి ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-12-31T23:37:24+05:30 IST
పోలీస్ అధికారులపై లోక్సభ స్పీకర్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఫిర్యాదు చేశారు. తెలంగాణ పోలీసులు తన హక్కులకు భంగం కల్గిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
హైదరాబాద్: పోలీస్ అధికారులపై లోక్సభ స్పీకర్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఫిర్యాదు చేశారు. తెలంగాణ పోలీసులు తన హక్కులకు భంగం కల్గిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పదే పదే హౌస్ అరెస్ట్ చేయడంపై రేవంత్రెడ్డి సీరియస్ అయ్యారు. అనుమతిలేకుండా అర్ధరాత్రి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించారని ఫిర్యాదులో రేవంత్ పేర్కొన్నారు. ఈ రోజు రేవంత్రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని శయంపేటలో రచ్చబండ కార్యక్రమానికి కాంగ్రెస్ పూనుకుంది. ఈ క్రమంలో రచ్చబండకు వెళ్లకుండా రేవంత్ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న రేవంత్ను పోలీసులు అడ్డుకున్నారు. ఆరోజు ఉదయం నుంచి రేవంత్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు... ఆయనను బయటకు వెళ్లనీయకుండా గృహనిర్బంధం చేశారు.