ఆ కొందరు పోలీసులకు రేవంత్ రెడ్డి హెచ్చరిక

ABN , First Publish Date - 2021-10-13T01:31:25+05:30 IST

పాలమూరు వలస బిడ్డల గురించి ఏనాడు పార్లమెంట్‌లో కేసీఆర్‌ మాట్లాడలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అమిస్తాపూర్‌లో..

ఆ కొందరు పోలీసులకు రేవంత్ రెడ్డి హెచ్చరిక

మహబూబ్‌నగర్‌: పాలమూరు వలస బిడ్డల గురించి ఏనాడు పార్లమెంట్‌లో కేసీఆర్‌ మాట్లాడలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అమిస్తాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విద్యార్థి జంగ్ సైరన్‌లో సీఎం కేసీఆర్‌పై ఆయన నిప్పులు చెరిగారు. పాలమూరు బిడ్డలు వలస కూలీలుగానే బతకాల్సిందేనా అని ప్రశ్నించారు. ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు నీళ్లు తరలించుకుపోయినా వైఎస్‌ దగ్గర కేసీఆర్‌ గులాంగిరీ చేశారని ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగులను సీఎం కేసీఆర్‌ మోసం చేశారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఊసే లేదన్నారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేవరకు కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని చెప్పారు. కొందరు పోలీసులు టీఆర్ఎస్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలను వేధిస్తే చూస్తూ ఊరుకోమని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. 



Updated Date - 2021-10-13T01:31:25+05:30 IST