తెలంగాణలో పెద్ద సమస్య కల్వకుంట్ల కుటుంబమే: రేవంత్రెడ్డి
ABN , First Publish Date - 2021-09-08T23:40:41+05:30 IST
సీఎం కేసీఆర్ కుటుంబంపై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో
హైదరాబాద్: సీఎం కేసీఆర్ కుటుంబంపై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబమే పెద్ద సమస్య అని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయినట్లు కనబడుతున్నారని ఎద్దేవాచేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ, త్యాగాల ప్రతీక.. అమరవీరుల స్థూపం కానీ పార్టీ ఆఫీసులు కాదని రేవంత్రెడ్డి అన్నారు.