కేసీఆర్‌పై మండిపడ్డ రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-09-19T01:10:12+05:30 IST

సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్

కేసీఆర్‌పై మండిపడ్డ రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, మూడెకరాలు, డబుల్ బెడ్రూమ్‌ ఇళ్లు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన 3 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను లాక్కున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన వాటాపై ఇంద్రవెల్లి నుంచి దండుకట్టామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సభలు విజయవంతమయ్యాయని తెలిపారు. సెప్టెంబర్ 17ను అడ్డం పెట్టుకుని రెండు మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Updated Date - 2021-09-19T01:10:12+05:30 IST