వైఎస్ షర్మిలపై రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-07-16T23:34:02+05:30 IST
వైఎస్ షర్మిలపై టీపీసీసీ అధ్యక్ష్యుడు రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల పార్టీపై విసుర్లు విసిరారు. ఆమెది రాజకీయపార్టీ కాదంటూ తోచిపుచ్చారు.
హైదరాబాద్: వైఎస్ షర్మిలపై టీపీసీసీ అధ్యక్ష్యుడు రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల పార్టీపై విసుర్లు విసిరారు. ఆమెది రాజకీయపార్టీ కాదంటూ తోసిపుచ్చారు. అంతేకాదు షర్మిల వ్యాఖ్యలను పట్టించుకోబోమని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు, నేతలు మాట్లాడితే స్పందిస్తామని, షర్మిల పార్టీ ఓ ఎన్జీవో సంస్థ లాంటిదని, ఆమె వ్యాఖ్యలపై స్పందించబోమని చెప్పారు. అంతేకాదు మీడియా ప్రతినిధులు కూడా స్పందించకుంటే తెలంగాణకు మేలు జరుగుతుందని సూచించారు. ఆమె పార్టీని సీరియస్ తీసుకోబోమని స్పష్టం చేశారు. ఆమెకు తన సోదరుడు సీఎం జగన్తో పంచాయితీ ఉందని, ఆయన ఆదరణ లేకపోవడంతో ఆ కోపాన్ని తమపై ప్రదర్శిస్తోందని రేవంత్రెడ్డి విమర్శించారు.