ఏబీఎన్ రాధాకృష్ణపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-05-04T20:28:59+05:30 IST

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ గురించి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏబీఎన్ రాధాకృష్ణపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ఇంటర్నెట్ డెస్క్: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ గురించి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ విషయంపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చానెల్ నిర్వహించిన ‘ది డిబేట్’ కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. జర్నలిస్ట్‌గా వేమూరి రాధాకృష్ణ గుండె ధైర్యం గురించి ప్రస్తావించారు. ‘‘రాధాకృష్ణగారు పెన్ను పడితే పూనకమే. ఆర్కే గారు డబ్బుకోసం కాకుండా.. ప్యాషన్ కోసమే చానెల్‌ను నడుపుతున్నారు. ప్రతి ఆదివారం ఆయన రాసే ‘కొత్తపలుకు’ అందుకు నిదర్శనం. మోదీ అయినా, కేసీఆర్ అయినా ఎవరిపై అయినా ఆయన అనుకున్నది అనుకున్నట్లు చెప్తారు.’’ అని రేవంత్ రెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.


కేసీఆర్ రాజకీయ క్రీడను కిక్‌లా చూస్తారని, అందులో భాగంగా ఒకొక్కరికి కిక్ ఇస్తుంటారని, అందులో భాగమే ఈటల బర్తరఫ్ అని రేవంత్ రెడ్డి విశ్లేషించారు. చంద్రబాబు, వైఎస్‌ను తాను ఏదో చేసేశానని, అలాగే మోదీని మచ్చిక చేసుకున్నానని, జగన్‌ను తన చెప్పుచేతల్లో పెట్టుకున్నానని కేసీఆర్ ఫీలవుతుంటారని రేవంత్ ఎద్దేవా చేశారు.



Updated Date - 2021-05-04T20:28:59+05:30 IST