మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ ఇంటికి రేవంత్రెడ్డి
ABN , First Publish Date - 2021-08-16T01:17:25+05:30 IST
మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి రేవంత్రెడ్డి
వికారాబాద్: మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ప్రసాద్ కుమార్ ఇంటికి రేవంత్రెడ్డి వెళ్లారు. టీపీసీసీ పదవి వచ్చిన తరువాత ప్రసాద్కుమార్ను కలవడంతో ప్రాధాన్యత సంతరింకుంది. ప్రస్తుత పార్టీ పరిస్థితులు భవిష్యత్తు రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రేవంత్రెడ్డిది సొంత జిల్లా కావడంతో జిల్లాలో కాంగ్రెస్ పట్టు సాధించేందుకు చేవెళ్ల పార్లమెంట్ పరిధిని పటిష్టం చేసేందుకు చర్చించినట్లు సమాచారం.