మైనార్టీ బంధు ఇవ్వాలి: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-08-14T22:41:17+05:30 IST

దళితబంధులా... మైనార్టీ బంధు ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ మైనారిటీ

మైనార్టీ బంధు ఇవ్వాలి: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: దళితబంధులా... మైనార్టీ బంధు ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో ధర్నా జరుగింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మైనార్టీ బడ్జెట్, వక్ఫ్ బోర్డు జ్యుడీషరీ పవర్స్ కల్పిస్తామని ప్రకటించారు. మైనార్టీ సభ ఓట్ల కోసం పెట్టలేదని, కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీలకు మేలు జరిగిందని గుర్తుచేశారు. రాష్ట్రపతి, సీఎం పదవులు ముస్లింలకు ఇచ్చింది కాంగ్రెస్ మాత్రమే ఇచ్చిందని తెలిపారు. కారును, పతంగిని నమ్ముకుంటే మోసపోయేది ముస్లింలేనని చెప్పారు. ట్రిపుల్ తలాక్, ఎన్ఆర్సీ, సీఏఏ చట్టాలను కాంగ్రెస్ మాత్రమే వ్యతిరేకించిందన్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోరాడే శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2021-08-14T22:41:17+05:30 IST