ఒక్కటి చేసినా ముక్కు నేలకు రాస్తా: రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2021-08-26T00:13:00+05:30 IST

మూడుచింతలపల్లిలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్‌ మాటలు అబద్ధాల మూటలన్నారు. దత్తత గ్రామాలను..

ఒక్కటి చేసినా ముక్కు నేలకు రాస్తా: రేవంత్ రెడ్డి

మేడ్చల్: మూడుచింతలపల్లిలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి దీక్ష  ముగిసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్‌ మాటలు అబద్ధాల మూటలన్నారు. దత్తత గ్రామాలను దగా కేసీఆర్‌ చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌ దత్తత గ్రామాల్లో వాస్తవాలు తెలిపేందుకే దీక్ష చేపట్టినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఒక్క హామీనీ నెరవేర్చలేదని ఆరోపించారు. ఒక్క హామీ నెరవేర్చినా తన ముక్కు నేలకు రాస్తానని చెప్పానని. అయినా సీఎం కేసీఆర్‌ తనతో చర్చకు రాలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


‘‘నేను దీక్ష చేపట్టి 24 గంటలయింది. పాల అమ్మేవాళ్లు రాలేదు. నీళ్లు అమ్మే వాళ్లు రాలేదు. భూములు కబ్జాలు చేసే వాళ్లు రాలేదు. జోకర్ మల్లన్న కూడా రాలే. ఈ భూమ్మీద జోకర్లను చూశాం. బోకర్లను చూశాం. కానీ పాల మల్లిగాడు సగం జోకర్.. సగం బ్రోకర్. వేదికలెక్కితే జోకర్‌లా మాట్లాడతారు. వేదిక దిగితే భూములు బ్రోకర్‌లాగా మాట్లాడుతారు. ఎవరు భూములు అమ్మినా.. కొనుగోలు చేసినా ఈ పాల మల్లిగాడికి కమీషన్ ఇవ్వాల్సిందే.’’ అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 



Updated Date - 2021-08-26T00:13:00+05:30 IST