విద్యార్థి జంగ్ సైరన్లో సీఎం కేసీఆర్పై గర్జించిన రేవంత్
ABN , First Publish Date - 2021-10-13T01:20:59+05:30 IST
విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై అమిస్తాపూర్లో కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు గడ్డపై..
మహబూబ్నగర్: విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై అమిస్తాపూర్లో కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు గడ్డపై నిరుద్యోగ విద్యార్థి జంగ్ సైరన్ మోగించామన్నారు. విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. కాంగ్రెస్ సభను చూసి టీఆర్ఎస్ భయపడుతోందని ఎద్దేవా చేశారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చిందని రేవంత్ చెప్పారు. ఉద్యమం ముసుగులో టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ విస్తరించుకున్నారని వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రజలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సురవరం ప్రతాపరెడ్డి.. బూర్గుల రామకృష్ణారావు.. జైపాల్ రెడ్డి లాంటి అతిరథ మహారథులు పుట్టిన గడ్డ మన పాలమూరు అని రేవంత్ పేర్కొన్నారు. ఇప్పటి పాలమూర్ టీఆరెఎస్ ఎమ్మెల్యేలు.. మన పాలమూరు పరువు తీస్తున్నారని మండిపడ్డారు.