కేటీఆర్కు దమ్ముంటే చర్చకు రావాలి.. మేం సిద్ధం: రేవంత్
ABN , First Publish Date - 2022-01-11T23:43:23+05:30 IST
రైతుల ఆత్మహత్యలపై కేటీఆర్కు దమ్ముంటే చర్చకు రావాలని, తాము సిద్ధమని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల బలహీనతను సొమ్ముచేసుకుంటోందని,...
హైదరాబాద్: రైతు ఆత్మహత్యలపై కేటీఆర్కు దమ్ముంటే చర్చకు రావాలని, తాము సిద్ధమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ పాలనలో అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అందుకేనా రైతు సంబరాలు? అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల బలహీనతను సొమ్ము చేసుకుంటోందని, సీఎం కేసీఆర్ మద్యం ఆదాయాన్ని భారీగా పెంచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఏడేళ్లలో కేసీఆర్ తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్గా మారారని విమర్శించారు. తులసి వనంగా ఉన్న రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.