కరోనా నివారణా చర్యలపై జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2020-04-09T22:11:22+05:30 IST
కరోనా నివారణా చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ విస్తరణ స్థితిగతులు, నివారణా చర్యలను సీఎంకు అధికారులు వివరించారు. ఢిల్లీ వెళ్లినవారు
అమరావతి: కరోనా నివారణా చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ విస్తరణ స్థితిగతులు, నివారణా చర్యలను సీఎంకు అధికారులు వివరించారు. ఢిల్లీ వెళ్లినవారు, వారి ప్రైమరీ కాంటాక్టులు వల్లే కేసులు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. వివరాలు సేకరించడంలో పోలీసులు కీలక పాత్ర పోషించారని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. కుటుంబాల వారీగా మూడో విడత సర్వేపై జగన్ ఆరా తీశారు. ప్రతి కుటుంబ ఆరోగ్య పరిస్థితుల వివరాలు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. మెడికల్ ఆఫీసర్ నిర్ధారించిన వారినే కాకుండా వైరస్ లక్షణాలు ఉన్న వారందరికీ కూడా పరీక్షలు చేయించాలని సూచించారు. ప్రతి ఆస్పత్రిలో కూడా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని జగన్, అధికారులకు సూచించారు.