శరవేగంగా పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం
ABN , First Publish Date - 2020-09-24T20:55:48+05:30 IST
తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణ, ఆధునిక సాంకేతి పరిజ్ణానంతో నేరాల అదుపు కోసం నిర్మిస్తున్న పోలీస్ ఇంటి గ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం శరవేగంగా పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్: తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణ, ఆధునిక సాంకేతి పరిజ్ణానంతో నేరాల అదుపు కోసం నిర్మిస్తున్న పోలీస్ ఇంటి గ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం శరవేగంగా పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు ఏర్పాటయిన హైపవర్ కమిటీ సమావేశం గురువారం కమిటీ ఽఛైర్మన్ సీఎస్ అధ్యక్షతన జరిగింది. ఈ మేరకు ఇప్పటి వరకూ పూర్తయిన పనుల పై సమీక్ష నిర్వహించారు. ఈ నిర్మాణం పూర్తయితే తెలంగాణ ప్రభుత్వం ఆత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో శాంతి భద్రతల పర్యవేక్షణ చేస్తున్న రాష్ట్రంగా పేరు తెచ్చుకోనుంది.
ఈ సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి, ఆర్ధికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్శర్మ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్త, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్, మెట్రోరైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి, ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రొఫెసర్ ఎన్వి రమణారావు,ఇతర ఉన్నతాధికారులుపాల్గొన్నారు.