మంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

ABN , First Publish Date - 2021-04-19T06:02:28+05:30 IST

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు పర్యటన ఏర్పాట్లను ఆదివారం మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పరిశీలించారు.

మంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

ఇల్లంతకుంట, ఏప్రిల్‌ 18: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు పర్యటన ఏర్పాట్లను ఆదివారం మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పరిశీలించారు. మంత్రి కేటీఆర్‌ సోమవారం ఇల్లంతకుంటలో  తహసీల్దార్‌ కార్యాలయం, సెంట్రల్‌ లైటింగ్‌, రైతువేదిక, మహిళా సంఘం భవనం ప్రారం భోత్సవాలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  కరోనా విస్తరిస్తున్నందున ప్రజలతో సమావేశాన్ని రద్దుచేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు, ఎంపీపీ వెంకటరమణారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ వేణురావు, సర్పంచ్‌ భాగ్యలక్ష్మిబాలరాజు, ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్యయాదవ్‌, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు గొడుగు తిరుపతి, మాజీ ఎంపీపీ గుడిసె అయిలయ్యయాదవ్‌, మండలపరిషత్‌ ఉపాధ్యక్షుడు శ్రీనాథ్‌గౌడ్‌, ఫ్యాక్స్‌చైర్మన్లు తిరుపతిరెడ్డి, అనంతరెడ్డి, రైతుబంధు జిల్లా డైరెక్టర్‌ మాధవరెడ్డి, రాకేష్‌, గ్రంథాలయ డైరెక్టర్‌ మల్లెంకి శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ సాదుల్‌, ఏఎంసీ డైరెక్టర్లు మీసరగండ్ల అనీల్‌కుమార్‌, రమేష్‌, కో ఆప్షన్‌ సభ్యుడు సలీం, నాయకులు కేవీఎన్‌రెడ్డి, రాకేష్‌, ప్రశాంత్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-19T06:02:28+05:30 IST