కోర్టు కేసులపై ప్రతి నెల హెచ్ఓడీలతో సమీక్ష
ABN , First Publish Date - 2021-08-29T01:46:46+05:30 IST
కోర్టు కేసులపై ప్రతి నెల హెచ్ఓడీలతో సమీక్ష చేయాలని అధికారులను
హైదరాబాద్: కోర్టు కేసులపై ప్రతి నెల హెచ్ఓడీలతో సమీక్ష చేయాలని అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. అన్ని డిపార్ట్మెంట్లలో పెండింగ్ కేసుల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్లైన్ లీగల్ కేసుల మానిటరింగ్ సిస్టమ్ ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎస్ తెలిపారు. కేసుల పర్యవేక్షణ కోసం ప్రతి డిపార్ట్మెంట్లో నోడల్ అధికారిని నియమించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో నోడల్ అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారు బాబును నియమించారు.