ఆర్జీయూకేటీ నోటిఫికేషన్ విడుదల
ABN , First Publish Date - 2021-08-01T11:53:26+05:30 IST
నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఆగస్టు 2 నుంచి 12 వరకు దరఖాస్తులు
బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఆగస్టు 2 నుంచి 12 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆగస్టు 18న ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటిస్తారు. ఈసారి పాలీసెట్ మార్కుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ప్రభుత్వ నాన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు పాలీసెట్లో వచ్చిన మార్కులకు 4.8 మార్కుల వెయిటేజీని కలుపుతారు. పాలీసెట్ రాసిన విద్యార్థులు ఎలాంటి ఫీజూ లేకుండా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్జీయూకేటీ.ఏసీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు 6304893876కు ఫోన్ చేయొచ్చని వర్సిటీ తెలిపింది.