రియా బెయిల్ పిటిషన్‌కు ప్రకృతి అడ్డంకి!

ABN , First Publish Date - 2020-09-23T23:39:24+05:30 IST

ముంబైలో కురిసిన కుండపోత వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం కావడంతో కోర్టులు...

రియా బెయిల్ పిటిషన్‌కు ప్రకృతి అడ్డంకి!

ముంబై: ముంబైలో కురిసిన కుండపోత వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం కావడంతో కోర్టులు, కార్యాలయాలు సహా సాధారణ కార్యకలాపాలన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. వాహనాలు కదిలే పరిస్థితి లేక రవాణా అస్తవ్యస్తం కావడంతో ఇవాళ హైకోర్టుకు సెలవు ప్రకటిస్తూ బోంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి పెట్టుకున్న బెయిల్ పిటిషన్లు వాయిదా పడ్డాయి. వీరి బెయిల్ పిటిషన్లపై రేపు విచారణ జరుగుతుందని రియా తరపు న్యాయవాది మనీషిండే పేర్కొన్నారు. కాగా బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రియా జ్యూడీషియల్ కస్టడీని ముంబై కోర్టు వచ్చే నెల 6 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.  



Updated Date - 2020-09-23T23:39:24+05:30 IST