మదరసాకు బియ్యం వితరణ

ABN , First Publish Date - 2021-05-07T06:50:55+05:30 IST

రంజాన్‌ మాసం సందర్భంగా పట్టణంలోని మదరసా పాఠశాలకు మాజీ సింగిల్‌ విండో అధ్యక్షుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు షేక్‌ ఇమాంసాహెబ్‌ క్వింటా బియ్యాన్ని గురువారం అందజేశారు.

మదరసాకు బియ్యం వితరణ
మదరసా నిర్వాహకులకు బియ్యం అందజేస్తున్న ఇమాంసాహెబ్‌


కనిగిరి, మే 6: రంజాన్‌ మాసం సందర్భంగా పట్టణంలోని మదరసా పాఠశాలకు మాజీ సింగిల్‌ విండో అధ్యక్షుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు షేక్‌ ఇమాంసాహెబ్‌ క్వింటా బియ్యాన్ని గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్‌మాసం ఎంతో పవిత్రమైనదన్నారు. ముస్లింలు అత్యంత భక్తి శ్రధ్ధలతో ప్రతిరోజూ నమాజ్‌ చేస్తూ గడిపే పండుగ మాసంలో తమ వంతుగా సహకారాన్ని అందించటం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఇస్లాం సేవాభావాన్ని బోధిస్తుందన్నారు. ప్రవక్త బోధనలు ప్రతిఒక్కరికి అనుసరణీయమన్నారు. ఇలాగే ప్రతి ఏటా తన శక్తి కొలది ఏదో ఒక రూపంలో ఈ రంజాన్‌మాసంలో ఇవ్వటం తనకు ఆనవాయితీగా చేస్తున్నట్లు చెప్పారు. ఆ అల్లా కరోనా నుండి ప్రజల్ని కాపాడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 


Updated Date - 2021-05-07T06:50:55+05:30 IST