కేసీఆర్‌తో రైస్ మిల్లర్ల ప్రతినిధుల భేటీ

ABN , First Publish Date - 2020-03-30T21:19:52+05:30 IST

ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు.

కేసీఆర్‌తో రైస్ మిల్లర్ల ప్రతినిధుల భేటీ

హైదరాబాద్: ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రైస్ మిల్లర్లు కూడా సహకరించాలని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం సూచించారు. అయితే కరోనా వైరస్ విస్తరించే నేపథ్యంలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నప్పుడు, హామాలీలను ఉపయోగించి లారీలలోకి లోడు ఎక్కిస్తున్న సమయంలో రక్షణ పద్ధతులు పాటించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రదేశాల్లో మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 

Updated Date - 2020-03-30T21:19:52+05:30 IST