తెలంగాణ నుంచి ఎక్కువ బియ్యం సేకరించాం : కేంద్రం

ABN , First Publish Date - 2021-12-01T19:14:20+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో ధాన్యం సేకరణను రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ నుంచి ఎక్కువ బియ్యం సేకరించినట్టు కేంద్రం వెల్లడించింది.

తెలంగాణ నుంచి ఎక్కువ బియ్యం సేకరించాం : కేంద్రం

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో ధాన్యం సేకరణను రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ నుంచి ఎక్కువ బియ్యం సేకరించినట్టు కేంద్రం వెల్లడించింది. లోక్‌సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్రం రాతపూర్వక సమాధానమిచ్చింది. 2018-19లో ఏపీలో 48.06 లక్షల మెట్రిక్ టన్నులుండగా, తెలంగాణలో 51.90 లక్షల మెట్రిక్ టన్నులు... 2019-20లో ఏపీ నుంచి 55.33 లక్షల మెట్రిక్ టన్నులు, తెలంగాణ నుంచి 74.54 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్టు తెలిపింది. 2020-21లో ఏపీ నుంచి 56.67 లక్షల మెట్రిక్ టన్నులు, తెలంగాణ నుంచి 94.53 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్టు కేంద్రం వెల్లడించింది. 



Updated Date - 2021-12-01T19:14:20+05:30 IST