ఘనంగా బంగారు మైసమ్మ బోనాలు
ABN , First Publish Date - 2020-08-15T05:30:00+05:30 IST
పట్టణంలోని చైతన్య నగర్లో బంగారు మైసమ్మ బోనాల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు
జడ్చర్ల, ఆగస్టు 14: పట్టణంలోని చైతన్య నగర్లో బంగారు మైసమ్మ బోనాల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనంతో వచ్చి, అమ్మవారిని దర్శించుకున్నారు. కరోనా వైరస్ పోవాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.