ఘనంగా ఎమ్మెల్యే ధర్మశ్రీ కుమార్తె వివాహం

ABN , First Publish Date - 2021-10-24T04:34:28+05:30 IST

చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రెండో కుమార్తె స్వాతి, చరణ్‌ల వివాహం శనివారం ఘనంగా జరిగింది.

ఘనంగా ఎమ్మెల్యే ధర్మశ్రీ కుమార్తె వివాహం
వివాహానికి హాజరైన అతిథులు

విశాఖపట్నం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రెండో కుమార్తె స్వాతి, చరణ్‌ల వివాహం శనివారం ఘనంగా జరిగింది. బీచ్‌రోడ్డులోని ఎంజీఎం పార్క్‌లో జరిగిన వివాహవేడుకకు ఉదయం నుంచే అతిథులు తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, రాష్ట్ర మంత్రులు అవంతి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, తానేటి వనిత, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌చల్లా మధుసూదన్‌రెడ్డి, జిల్లాతోపాటు రాష్ట్రంలోని పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఇతర ఉన్నతాధికారులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Updated Date - 2021-10-24T04:34:28+05:30 IST