ఘనంగా లక్ష తులసీ అర్చన

ABN , First Publish Date - 2021-10-18T04:52:22+05:30 IST

కూనలచ్చున్నాయుడుపేట అభయాంజనేయ మందిరంలో ఆదివారం లక్ష తులసి అర్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

ఘనంగా లక్ష తులసీ అర్చన
తులసి పూజలో పాల్గొన్న భక్తులు

జలుమూరు, అక్టోబరు 17: కూనలచ్చున్నాయుడుపేట అభయాంజనేయ మందిరంలో ఆదివారం లక్ష తులసి అర్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆశ్వీయుజ శుద్ధ ద్వాదశి పర్వదినం సందర్భంగా అర్చకుడు మామిడి రామినాయుడు ఆధ్వర్యంలో స్వామికి లక్ష తులసి పూజ చేపట్టారు. లోక కళ్యాణార్థం ప్రతీ ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.  పూజా కార్యక్రమంలో గ్రామంతో పాటు అబ్బాయిపేట, ఊడిగలపాడు గ్రామాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. 

 

Updated Date - 2021-10-18T04:52:22+05:30 IST