ఘనంగా కవి సమ్మేళనం

ABN , First Publish Date - 2022-06-03T04:56:37+05:30 IST

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో కవి సమ్మేళనం నిర్వహించారు.

ఘనంగా కవి సమ్మేళనం
కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ దంపతులతో నృత్య ప్రదర్శనలో పాల్గొన్న చిన్నారులు

- అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

- హాజరైన కలెక్టర్‌ దంపతులు


నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జూన్‌ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో కవి సమ్మేళనం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై కవి సమ్మేళనాన్ని ప్రారంభించారు. పలువురు కవులు పాల్గొని వారి కవితలు వినిపించారు. జానపద కళాకారులు, చిన్నారుల శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి. అనంతరం కవి సమ్మేళనం, నృత్య ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన వారికి కలెక్టర్‌ దంపతుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. డీపీఆర్వో సీతారాం, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుధాకర్‌లాల్‌, ఆర్టీఏ ఎర్రిస్వామి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాంలాల్‌, డీఈవో గోవిందరాజులు, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి శ్రీనివాసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.     


Updated Date - 2022-06-03T04:56:37+05:30 IST