America లో ఘోరం.. కదులుతున్న రైలులో అందరూ చూస్తుండగా మహిళపై అఘాయిత్యం!

ABN , First Publish Date - 2021-10-18T17:36:17+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఘోరం జరిగింది.

America లో ఘోరం.. కదులుతున్న రైలులో అందరూ చూస్తుండగా మహిళపై అఘాయిత్యం!

పెన్సిల్వేనియా: అగ్రరాజ్యం అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఘోరం జరిగింది. బుధవారం రాత్రి ఎస్ఈపీటీఏ(ది సౌత్ఈస్టర్న్ పెన్సిల్వేనియా ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ) రైలులో అందరూ చూస్తుండగానే మహిళపై ఓ దుండగుడు అఘాత్యానికి పాల్పడ్డాడు. మార్కెట్-ఫ్రాంక్‌పోర్డ్ లైన్ ట్రైన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అప్పర్ డార్బీ పోలీసులు నిఘా కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


అప్పర్ డార్బీ పోలీస్ డిపార్ట్‌మెంట్ సూపరింటెండెంట్ తిమోతి బెర్న్‌హార్డ్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్కెట్-ఫ్రాంక్‌పోర్డ్ లైన్ ఎస్ఈపీటీఏ ట్రైన్‌లో తప్పు జరుగుతున్నట్లు బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో సమాచారం అందినట్లు తిమోతి తెలిపారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు 69వ స్ట్రీట్ టర్మినల్ వద్ద రైలు ఆగడంతో వెంటనే నిందితుడు ఫిస్టన్ ఎంగోయ్(35) అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందే పోలీసులు నిఘా కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా ఫిస్టన్‌‌ను నిందితుడిగా గుర్తించారు. దాంతో ట్రైన్ ఆగిన వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాధితురాలిని వైద్య పరీక్షల కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 


కాగా, రైలులో ఇతర ప్రయాణికులు చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. కానీ, ఎవరూ ఈ కీచక పర్వాన్ని నిలువరించే ప్రయత్నం చేయలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనను భయంకరమైన క్రిమినల్ చర్యగా పేర్కొన్న అప్పర్ డార్బీ పోలీసులు నిందితుడు ఫిస్టన్‌పై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. డెలావేర్ కౌంటీ కోర్టులో ప్రస్తుతం నిందితుడిపై విచారణ జరుగుతుందని తిమోతి బెర్న్‌హార్డ్ వెల్లడించారు. ఇలాంటి చర్యలను ఎట్టిపరిస్థితిలో ఉపేక్షించబోమని, కఠిన శిక్షలు ఉంటాయన్నారు. 

Updated Date - 2021-10-18T17:36:17+05:30 IST