‘కాచిగూడ’ సేవలపై రైల్వే మంత్రికి ట్విట్టర్లో ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-01-17T06:37:03+05:30 IST
హైదరాబాద్ డివిజన్ పరిధిలోని కాచిగూడ రైల్వేస్టేషన్లో లోపభూయిష్ట సేవలపై నగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ బాధ్యులు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూ్ష గోయల్కు శనివారం ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ సిటీ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ డివిజన్ పరిధిలోని కాచిగూడ రైల్వేస్టేషన్లో లోపభూయిష్ట సేవలపై నగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ బాధ్యులు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూ్ష గోయల్కు శనివారం ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. స్టేషన్లో సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు సరిగా లేవని, డిజిటల్ రిజర్వేషన్ చార్ట్ పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. స్పందించిన సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ స్టేషన్లో ఏర్పడిన సమస్యకు చింతిస్తున్నామని చెప్పారు. విషయాన్ని హైదరాబాద్ డీఆర్ఎంకు తెలియజేయగా, సమస్యను పరిష్కరించాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు.