పెన్నా నదిలో పెరుగుతున్న వరద ఉధృతి

ABN , First Publish Date - 2020-09-20T02:34:54+05:30 IST

పెన్నా నదిలో పెరుగుతున్న వరద ఉధృతి కొనసాగుతోంది. అనంతపురం, కడప జిల్లాల్లోని చెరువులు నిండిపోయాయి. కడప జిల్లాలోని మైలవరం డ్యాం నుంచి సోమశిలకి భారీగా వరద వస్తోంది.

పెన్నా నదిలో పెరుగుతున్న వరద ఉధృతి

నెల్లూరు: పెన్నా నదిలో వరద ఉధృతి పెరుగుతోంది. అనంతపురం, కడప జిల్లాల్లోని చెరువులు నిండిపోయాయి. కడప జిల్లాలోని మైలవరం డ్యాం నుంచి సోమశిలకి భారీగా వరద వస్తోంది. దీంతో పెన్నా ప్రాంత గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ఆదివారం ఉదయానికి మరింత వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఈశాన్యంలో వరుణుడు కరుణించాడు. విస్తారంగా కురిసిన వర్షాలతో జిల్లాలోని అన్ని వనరులు జలకళ సంతరించుకున్నాయి. మరోవైపు ఎగువ ప్రాంతం నుంచి వరద భారీగా వచ్చి చేరుతుండటంతో సోమశిల జలాశయం పొంగి పొరలుతోంది. జిల్లాలో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరుగుతుండటం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు మెండుగా ఉండటంతో రెండేళ్లపాటు జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు ఉండవని అధికారులు అంటున్నారు. 

Updated Date - 2020-09-20T02:34:54+05:30 IST