గోదావరికి పెరుగుతున్న వరద నీరు

ABN , First Publish Date - 2020-08-13T17:24:24+05:30 IST

గోదావరికి వరద నీరు క్రమంగా పెరుగుతోంది.

గోదావరికి పెరుగుతున్న వరద నీరు

ప.గో.జిల్లా: గోదావరికి వరద నీరు క్రమంగా పెరుగుతోంది. గత నాలుగు రోజుల నుంచి వరద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. గోదావరికి వరద పెరుగుతుండడంతో దూరప్రాంత మండల ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది. కాఫర్ డాం వద్ద 24.750 సెంటీమీటర్లకు నీటి మట్టం పెరిగింది. అలాగే పోలవరం గ్రామం వద్ద నీటిమట్టం 10.610 మీటర్లకు చేరింది. అటు కొత్తూరు కాజ్వేపై 5 అడుగుల మేర వరద నీరు వచ్చి చేరింది. దీంతో 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

Updated Date - 2020-08-13T17:24:24+05:30 IST