అరకులో పెరుగుతున్న పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-08-15T09:48:58+05:30 IST
అరకులోయలో పాజిటివ్ కేసులు అధికంగానే నమోదవుతున్నాయి. స్థానిక ఏరియా ఆస్పత్రిలోని ఐసోలేషన్ కేంద్రంలో 14 మంది
అరకులోయ, ఆగస్టు 14: అరకులోయలో పాజిటివ్ కేసులు అధికంగానే నమోదవుతున్నాయి. స్థానిక ఏరియా ఆస్పత్రిలోని ఐసోలేషన్ కేంద్రంలో 14 మంది చికిత్స పొందుతున్నారు. శుక్రవారం పట్టణానికి చెందిన ఎలకా్ట్రనిక్ మీడియా రిపోర్టర్కు పాజిటివ్ రావడం, శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడడంతో తగరపువలస ఎన్ఆర్ఐ కొవిడ్ ఆస్పత్రికి రిఫర్ చేసినట్టు డాక్టర్ రాము తెలిపారు. మూడు మండలాల్లో ఇప్పటివరకు 120 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. ప్రతీ ఒక్కరూ మాస్కు పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలన్నారు.