అమిత్‌షా డిజిటల్ ర్యాలీకి వ్యతిరేకంగా ఆర్జేడీ నిరసన ప్రదర్శన

ABN , First Publish Date - 2020-06-07T18:13:42+05:30 IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా డిజిటల్ ర్యాలీని వ్యతిరేకిస్తూ... ప్రతిపక్ష ఆర్జేడీ ఆదివారం నిరసన ప్రదర్శన చేపట్టింది.

అమిత్‌షా డిజిటల్ ర్యాలీకి వ్యతిరేకంగా ఆర్జేడీ నిరసన ప్రదర్శన

పాట్నా : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా డిజిటల్ ర్యాలీని వ్యతిరేకిస్తూ... ప్రతిపక్ష ఆర్జేడీ ఆదివారం నిరసన ప్రదర్శన చేపట్టింది. ‘‘గరీబ్ అధికార్ దివస్’ పేరుతో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆర్జేడీ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌తో మరికొందరు నేతలు ప్లేట్లు వాయిస్తూ, సామాజిక దూరాన్ని పాటిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు.


అమిత్‌షా ర్యాలీ రాబందు వాదమని, ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఎన్నికల విజయం కోసం పాకులాడుతున్నారని బీజేపీపై తేజస్వీ తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు బిహార్ ఎన్నికలను దగ్గరపడుతున్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా డిజిటల్ ర్యాలీని ఆదివారం ప్రారంభించనున్నారు. 

ఆర్జేడీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఫైర్

కొన్ని రాజకీయ పక్షాలు కేవలం బీజేపీని, మోదీని విరోధించడమే పనిగా పెట్టుకుంటారని ఆయన పరోక్షంగా ఆర్జేడీ నిరసన ప్రదర్శనపై మండిపడ్డారు. కరోనా మహమ్మారి సమయంలో కృతజ్ఞతా పూర్వంకగా కోవిడ్ యోధులకు ప్లేటు, చప్పట్లు కొట్టాలని పిలుపునిచ్చిన సమయంలో వ్యతిరేకించిన వారే... ఇప్పుడు మాత్రం పేదల హక్కుల కోసం ప్లేట్లు కొడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారని గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. 


Updated Date - 2020-06-07T18:13:42+05:30 IST