బీహార్‌ రాజకీయాలపై ఆర్జేడీ ఎమ్మెల్యే సంచలన కామెంట్లు!

ABN , First Publish Date - 2021-07-28T17:26:17+05:30 IST

మెజారిటీకి కాస్త తేడాతో బీహార్ ప్రభుత్వం నడుస్తోంది.

బీహార్‌ రాజకీయాలపై ఆర్జేడీ ఎమ్మెల్యే సంచలన కామెంట్లు!

పట్నా: మెజారిటీకి కాస్త తేడాతో బీహార్ ప్రభుత్వం నడుస్తోంది. ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు ఇటు అటుగా ఉండటంతో రాష్ట్రంలోని రాజకీయల్లో అధికార సమీకరణలు మారిపోతున్నాయి. ఈ నేపధ్యంలో నితీష్ కుమార్ ప్రభుత్వం కూలిపోతుందంటూ మహాగఠబంధన్ నేతలు తరచూ వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా రాష్ట్రీయ జనతాదళ్ ఎమ్మెల్యే భాయీ వీరేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఆగస్టు 15న తమ నేత తేజస్వీ యాదవ్... గాంధీ మైదానంలో జెండా ఎగురవేస్తారని అన్నారు. బీహార్ ఎన్డీఏలో ఆట ప్రారంభమయ్యిందని, నితీష్ కుమార్ ప్రభుత్వం కూలిపోవడమనేది నిశ్చయమైపోయిందని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.  


Updated Date - 2021-07-28T17:26:17+05:30 IST