సమష్టి కృషితో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం
ABN , First Publish Date - 2021-11-27T05:14:14+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి డిప్యూటీ డీఈవోలు సమష్టి కృషి చేయాలని పాఠశాల విద్య సంయుక్త సంచాలకుడు(ఆర్జేడీ) సుబ్బారావు విజ్ఞప్తి చేశారు.
ఆర్జేడీ సుబ్బారావు
గుంటూరు(విద్య), నవంబరు 26: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి డిప్యూటీ డీఈవోలు సమష్టి కృషి చేయాలని పాఠశాల విద్య సంయుక్త సంచాలకుడు(ఆర్జేడీ) సుబ్బారావు విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని తన కార్యాలయంలో శుక్రవారం మూడు జిల్లాల డిప్యూటీ డీఈవోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు, మౌలిక వసతులపై దృష్టిసారించి తనిఖీలు చేయాలన్నారు. విద్యార్థుల ప్రగతి నివేదికను ప్రతినెల 5లోగా పంపాలని సూచించారు. చదువులో వెనుబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించి వారికి మెరుగైన బోధన అందేలా చూడాలన్నారు. సమావేశంలో డీఈవో ఆర్ఎస్ గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.