టీడీపీ సానుభూతిపరుడని ఆర్ఎంపీ వైద్యుడి అరెస్ట్

ABN , First Publish Date - 2020-05-23T14:51:19+05:30 IST

విజయవాడ: కృష్ణా జిల్లా ఉయ్యూరు రూరల్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆందోళనకు దిగారు.

టీడీపీ సానుభూతిపరుడని ఆర్ఎంపీ వైద్యుడి అరెస్ట్

విజయవాడ: కృష్ణా జిల్లా ఉయ్యూరు రూరల్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆందోళనకు దిగారు. కాటూరు గ్రామానికి చెందిన రాంబాబు అనే ఆర్ఎంపీ వైద్యుడిని టీడీపీ సానుభూతి పరుడని పోలీసులు అరెస్ట్ చేశారని ఆరోపణలు వినవస్తున్నాయి. రాంబాబు క్లినిక్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా మద్యం బాటిళ్లు ఏర్పాటు చేసి పోలీసులకు సమాచారం అందించారని తెలుస్తోంది. అర్ధరాత్రి 1 గంటకు క్లినిక్‌పై పోలీసులు దాడులు జరిపి... రాంబాబును అరెస్ట్ చేశారు. గతంలో రాంబాబు రేషన్ షాపు తొలగించేందుకు సైతం యత్నం జరిగింది. అరెస్ట్ విషయం తెలుసుకుని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ రూరల్ స్టేషన్‌కి చేరుకున్నారు. పోలీసుల వైఖరిపై రాజేంద్రప్రసాద్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Updated Date - 2020-05-23T14:51:19+05:30 IST