ఉప్పుటేరు శివారు డ్రెడ్జింగ్‌ చేయాలి

ABN , First Publish Date - 2020-10-30T04:22:46+05:30 IST

కొల్లేరు నీరు సముద్రంలోనికి వెళ్లేందుకు వీలుగా ఉప్పుటేరు శివారున డ్రెడ్జింగ్‌ చేయాలని ఫార్వర్డ్‌ బ్లాక్‌, కిసాన్‌ సంఘ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీ.సుందర రామరాజు, ఉపాధ్యక్షుడు లంక కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు.

ఉప్పుటేరు శివారు డ్రెడ్జింగ్‌ చేయాలి
సిద్ధాపురం రహదారి ముంపులో ఫార్వర్డ్‌ బ్లాక్‌ నేతలు

ఆకివీడు, అక్టోబరు 29: కొల్లేరు నీరు సముద్రంలోనికి వెళ్లేందుకు వీలుగా ఉప్పుటేరు శివారున డ్రెడ్జింగ్‌ చేయాలని ఫార్వర్డ్‌ బ్లాక్‌, కిసాన్‌ సంఘ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీ.సుందర రామరాజు, ఉపాధ్యక్షుడు లంక కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. వరద నీటిలో మునిగిఉన్న సిద్ధాపురం రహదారిని గురువారం వారు పరిలించారు. మండలంలో వరి చేలు కుళ్లిపోయాయని, ఆక్వా చెరువులు గట్లు తెగి చెల్లాచెదురయ్యాయని, రహదారులు చెరువులు, కా లువలను తలపిస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, ప్రజానీకానికి పరిహరం చెల్లించాలన్నారు. దండు శ్రీనివాసరాజు, ధనాల సిద్ధూ, కనుమూరి వెంకటపతిరాజు, మోకా బాలకృష్ణ బృందం ఉన్నారు.

Updated Date - 2020-10-30T04:22:46+05:30 IST