రోడ్డు ప్రమాదంలో పూలవ్యాపారి మృతి
ABN , First Publish Date - 2021-05-17T05:44:49+05:30 IST
ఖమ్మంలో పూలవ్యాపారం చేసుకుంటున్న జలగం రామారావు(57) రోడ్డుప్రమాదానికి గురై మృతి చెందిన సంఘటన ఆదివారం పల్లిపాడు వద్ద జరిగింది.
కొణిజర్ల, మే 16: ఖమ్మంలో పూలవ్యాపారం చేసుకుంటున్న జలగం రామారావు(57) రోడ్డుప్రమాదానికి గురై మృతి చెందిన సంఘటన ఆదివారం పల్లిపాడు వద్ద జరిగింది. ఏఎ్సఐ బేగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం మమతరోడ్డులో నివాసం ఉంటున్న రామారావు పూలవ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో తన టాటా మ్యాజిక్ వాహనంలో డ్రైవర్ గుగులోతు బిక్షంను వెంట పెట్టుకొని కృష్ణజిల్లా మైలవరం దగ్గర చండ్రుగూడెం వెళ్లి మల్లెపూల తీసుకొని ఖమ్మం వస్తున్నారు. వైరా దాటిన తర్వాత పల్లిపాడు సమీపంలోకి వచ్చే సరికి డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్ల రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొని ఓ ఇంట్లోకి దూసుకెళ్లి మెట్లకు తగిలి ఆగింది. డ్రైవర్కు గాయాలు అయిన్నప్పటికి పక్కనే ఉన్న పూలవ్యాపారి రామారావు బలమైన గాయాలతో అక్కడకుఅక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎ్సఐ పేర్కొన్నారు.