ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2020-12-04T18:24:41+05:30 IST

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

తూర్పుగోదావరి: జిల్లాలోని కోటిపల్లి- యనాం ఏటిగట్టు రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పి గన్నవరం మండలం కోట గ్రామం వద్ద కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతులను రిటైర్డ్ టీచర్ సత్యనారాయణ, ఆయన భార్య , రిటైర్డ్ లెక్చరర్ విజయలక్ష్మి, కుమారుడు ప్రణీత్‌గా గుర్తించారు. కాకినాడ నుంచి యానాం వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.  

Updated Date - 2020-12-04T18:24:41+05:30 IST