బైక్ను ఢీకొట్టిన కారు...ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2021-01-14T21:50:20+05:30 IST
బైక్ను ఢీకొట్టిన కారు...ఇద్దరు మృతి
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. చింతూరు మండలం చట్టి వద్ద బైక్ ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు చింతూరు మంలం నరసింహాపురం గ్రామానికి చెందిన రామకృష్ణ 26, సీతయ్య (48)గా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరపుతున్నారు.