అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2021-01-17T13:21:14+05:30 IST

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.

అనంతపురం జిల్లాలో  రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లా: గుంతకల్లు పట్టణ శివారులోని బళ్ళారి రోడ్డు.. జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వజ్రకరూరు మండలం, కొనకొండ్ల గ్రామానికి చెందిన రమణమ్మ (35) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు బావమ్మ,  లక్ష్మిదేవి, నాగవేణి, సుమ  తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-01-17T13:21:14+05:30 IST