రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-04-14T06:09:41+05:30 IST
రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు.
ఆలమూరు, ఏప్రిల్ 13: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. విజయనగరం జిల్లాకు చెందిన ముంజేటి రామారావు(45), లక్ష్మణరావులు నర్సరీ పనుల కోసం వచ్చి కడియం మండలం వెంకయమ్మపేట గ్రామంలో నివాసం ఉంటున్నారు. చింతలూరు నూకాంబికా అమ్మవారి దర్శనానికి వచ్చి తిరిగి మోటార్సైకిల్పై వెళ్తుండగా జొన్నాడ సెంటర్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా రావులపాలెం వైపు వెళ్తుతున్న ట్రాలీ ఢీకొట్టింది. ఈప్రమాదంలో రామారావు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ లక్ష్మణరావును రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ శివప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.