రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-03-06T06:06:18+05:30 IST
జెడ్.మేడపాడు వంతెన వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు.
మండపేట, మార్చి 5: జెడ్.మేడపాడు వంతెన వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మండపేట రూరల్ ఎస్ఐ పి.దొరైరాజు తెలిపిన వివరాల ప్రకారం ద్వారపూడికి చెందిన ముదునూరి చినమార్రాజు శుక్రవారం తెల్లవారుజామున వాకింగ్ కోసం వచ్చి జెడ్.మేడపాడు కెనాల్ రోడ్డులో నిలుచుని ఉండగా వేములపల్లి వెళ్తున్న క్వారీలారీ ఢీకొట్టింది. తీవ్రగాయాలైన ఆయన అక్కడి కక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.