Kurnool : లోయలో పడ్డ బస్సు.. ముగ్గురికి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2021-11-29T19:45:44+05:30 IST

కర్నూలు : జిల్లాలోని ఎగువ అహోబిలం రహదారిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Kurnool : లోయలో పడ్డ బస్సు.. ముగ్గురికి తీవ్రగాయాలు

కర్నూలు : జిల్లాలోని ఎగువ అహోబిలం రహదారిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఎగువ అహోబిలం నుంచి దిగువ అహోబిలంకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కాగా క్షతగాత్రులు ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

Updated Date - 2021-11-29T19:45:44+05:30 IST