చాగల్లు వద్ద ఆగిఉన్న టూరిస్ట్ బస్సును ఢీ కొన్న లారీ

ABN , First Publish Date - 2021-11-21T20:18:40+05:30 IST

స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం చాగల్లు వద్ద ఆగివున్న టూరిస్ట్ బస్ను ఆదారిలో వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి

చాగల్లు వద్ద ఆగిఉన్న టూరిస్ట్ బస్సును ఢీ కొన్న లారీ

జనగామ: స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం చాగల్లు వద్ద ఆగివున్న టూరిస్ట్ బస్ను ఆదారిలో వస్తున్న లారీ ఢీ కొట్టింది.  ఆదివారం తెల్లవారుజామున జరిగిన  ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యచికిత్స కోసం యంజియం అసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ఘటనలో గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని యంజియం వైద్యాధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసు కమిషనర్ ను అడిగి తెలుసున్న మంత్రి దయాకర్ రావు ప్రమాద బాధితులకు అవసమైన సహాయం అందించాలని సూచించారు. బాధితులు హసన్ పర్తి మండలం దేవన్నపేట గ్రామానికి చెందిన వారుగా తెలిసింది.

Updated Date - 2021-11-21T20:18:40+05:30 IST