తగరపువలస వద్ద రోడ్డు ప్రమాదం... జిల్లావాసి మృతి
ABN , First Publish Date - 2021-04-20T05:23:12+05:30 IST
సైరిగాం గ్రామానికి చెందిన కొర్ను ఆదినారాయణ (38) విశాఖ జిల్లా తగరపువలస వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.
జలుమూరు : సైరిగాం గ్రామానికి చెందిన కొర్ను ఆదినారాయణ (38) విశాఖ జిల్లా తగరపువలస వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. విశాఖలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఆదినారాయణ... తన ద్విచక్రవాహనంపై డ్యూటీకి వెళ్తుండగా లారీ ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఆదినారాయణకు తల్లిదండ్రులు లక్ష్మి, రామ్మూర్తి, భార్య గీతాపార్థవి, ఇద్దరు కుమారులు రేవంత్, నిహార్ ఉన్నారు. పెద్ద దిక్కుగా ఉన్న ఆదినారాయణ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. అందరితో కలివిడిగా ఉండే ఆదినారా యణ మృతితో సైరిగాంలో విషాదఛాయలు అలుముకున్నాయి.