Bengaluru: లారీ, ఆటో ఢీ: ముగ్గురి మృతి
ABN , First Publish Date - 2021-11-14T17:13:56+05:30 IST
యాదగిరి నగర శివారులో ముద్నాళ క్రాస్ వద్ద లారీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందారు. శుక్రవారం రాత్రి 12.30 గంటలకు వాడి వైపు నుంచి లారీ వస్తుండగా యాదగిరి నుంచి కెంచగార
బెంగళూరు: యాదగిరి నగర శివారులో ముద్నాళ క్రాస్ వద్ద లారీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందారు. శుక్రవారం రాత్రి 12.30 గంటలకు వాడి వైపు నుంచి లారీ వస్తుండగా యాదగిరి నుంచి కెంచగారహళ్లికి వెళుతున్న ప్యాసింజర్ ఆటో పరస్పరం ఢీకొన్నాయి. ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. యాదగిరి తాలూకాకు చెందిన కెంచగారహళ్లి నివాసి లక్ష్మణ నామదేవ (26), జయరామ రామచంద్ర చవాణ్(45), రెండున్నర నెలల పసికందు సంతోష్ మృతి చెందారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.