రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
ABN , First Publish Date - 2021-07-30T04:53:30+05:30 IST
రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృత్యువాత పడింది.
పెంటపాడు, జూలై 29 : రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాలివి. రాజమండ్రిలోని ఓ వాటర్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్న గుబ్బల కార్తిక్, నాగలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భీమవరంలో నివాసముంటున్న తన తండ్రికి జ్వరంగా ఉండడంతో బుధవారం రాత్రి భార్యతో పాటు రెండో కుమార్తె పద్మవర్షిణి, మూడో కుమార్తె శివతేజశ్విని(4)లతో బైక్పై రాజమండ్రి నుంచి వస్తుండగా పెంటపాడు మండలం ముదునూరు శివారులో బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. కార్తిక్, చిన్నారి శివతేజశ్వినికి తీవ్ర గాయాలవడంతో 108లో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. మెరుగైన వైద్యం కోసం అతనిని రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. భార్య నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.