రోడ్డు ప్రమాదంలో Conistable మృతి
ABN , First Publish Date - 2021-11-27T16:01:46+05:30 IST
శివగంగ జిల్లా తిరువేంగడం ప్రాంతం వద్ద శుక్రవారం ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో విపత్తుల నివారణ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ మృతిచెందారు. ఇలమనూరుకు చెందిన సురేష్ కాలైగ్రామం
చెన్నై: శివగంగ జిల్లా తిరువేంగడం ప్రాంతం వద్ద శుక్రవారం ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో విపత్తుల నివారణ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ మృతిచెందారు. ఇలమనూరుకు చెందిన సురేష్ కాలైగ్రామం పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఆ ప్రాంతంలో వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్న సురేష్ ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతుండగా తిరువేంగడం వద్ద పరముకుడి నుంచి తిరుచ్చికి వెళుతున్న రవాణా సంస్థ బస్సు అదుపు తప్పి బైకును ఢీకొన్నది. ఈ దుర్ఘటనలో సురేష్ తీవ్రంగా గాయపడి ఆ స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇలయాంకుడి పోలీసులు కేసు నమోదు చేశారు.