గుంటూరులో బైక్ను ఢీకొన్న మినీవ్యాన్
ABN , First Publish Date - 2021-04-11T13:28:30+05:30 IST
జిల్లాలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రొంపిచర్ల సమీపంలో మినీ వ్యాన్ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న తమిశెట్టి...
గుంటూరు: జిల్లాలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రొంపిచర్ల సమీపంలో మినీ వ్యాన్ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న తమిశెట్టి శ్రీనివాసరావు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నార్కెట్పల్లి-అద్దంకి హైవేపై చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.