గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం..
ABN , First Publish Date - 2021-05-10T13:31:14+05:30 IST
జిల్లాలోని ఫిరంగిపురం సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు
గుంటూరు: జిల్లాలోని ఫిరంగిపురం సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని వేములూరి పాడు వద్ద చోటు చేసుకుంది. తాళ్లూరు నుంచి అమరావతి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు షేక్ చినహుస్సేన్(55), నూర్జహాన్(45), హుస్సేన్(25)గా గుర్తించారు. మృతులంతా తాళ్లూరు వాసులు. ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు నిర్ధారించారు.